PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాధిత కుటుంబానికి.. జనసైనికుల అండ..

1 min read

– రూ.35వేలు ఆర్థిక సాయం చేసిన ఎన్​ఆర్​ఐ సేవా సంస్థ, డోన్​ జనసైనికులు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కరోన వైరస్​తో మృతి చెందిన బాధిత కుటుంబాలకు జన సైనికులు అండగా నిలుస్తున్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్​కళ్యాణ్​ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోని జన సైనికులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కర్నూలు జిల్లా డోన్​ పట్టణానికి చెందిన జన సైనికుడు రాజశేఖర్​ గత నెలలో కరోనతో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించేందుకు జనసేన గల్ఫ్ ఎన్​ఆర్​ఐ సేవా సంస్థ వారు రూ. 15వేలు, డోన్​ పట్టణానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తల సహకారంతో రూ. 20వేలు కలిపి మొత్తం 35వేలును అందజేశారు. డబ్బును కూతర్ల పేరిట డిపాజిట్​ చేసి.. రాజశేఖర్​ భార్యకు చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆపదలో ఉన్న జన సైనికులను , పేదలను ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బాలు యాదవ్​, బ్రహ్మం, సునీల్​ కుమార్​, మధుసాగర్​, మల్లి, డాబా వెంకటేష్​, మల్లెంపల్లె వెంకటేష్​, బేతంచర్ల మద్దయ్య నాయుడు, పరమేష్​, కొమ్ములపలలె గ్రామ జనసైనికులు ప్యాపిలి సునీల్​, కాశీ, చంద్ర, మహమ్మద్​, అల్లాబకాష్​, హరీష్​, గోపాల్​, డోన్​ జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

About Author