బిఎస్ఎన్ఎల్ దీపావళి బంపర్ ఆఫర్లు
1 min read

ఉచితంగా సిమ్ తో పాటు కేవలం
రూ.1 రీఛార్జితో 30 రోజులు పాటు ప్రతిరోజు 2 జిబి డేటా, ఉచిత కాల్స్ మరియు 100 ఎస్ఎంఎస్ లు.
కర్నూలు, న్యూస్ నేడు: బిఎస్ఎన్ఎల్ దీపావళి కానుకగా కొత్త వినియోగదారులకు మరియు పోర్ట్ ఇన్ అయ్యే వారికి ఉచితంగా 4జి సిమ్ ఇవ్వడంతో పాటు కేవలం ఒక రూపాయి రీచార్జితో నెల రోజులపాటు అపరిమితమైన వాయిస్ కాల్స్, ప్రతిరోజు 2 జి బి హై స్పీడ్ డేటా మరియు 100 ఎస్ఎం ఎస్ లు అందిస్తున్నదని బిఎస్ఎన్ఎల్ కర్నూలు బిజినెస్ జనరల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ శ్రీ జి రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ ఆఫర్ 15వ తేదీ అక్టోబర్ నుండి 15వ తేదీ నవంబర్ వరకు ఉంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మనిర్భర భారత్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ పూర్తి స్వదేశీ సాంకేతికతతో తయారుచేసిన 4జి సేవలను భారత ప్రధానమంత్రి ఇటీవలే జాతికి అంకితం చేశారని తెలుపుతూ వినియోగదారులు దగ్గర్లో ఉన్న ఈ ప్లాను కింద కేవలం 625 రూపాయలకే , 75 ఎంబీపిఎస్ స్పీడుతో ఇంటర్నెట్ మరియు స్కైప్రో హిందీ ఫుల్ ఫ్యామిలీ మ్యాక్స్ హెచ్ డి ప్యాకేజీ తో సుమారు 475 టీవీ ఛానల్ల ను మరియు సోనీ లివ్ ప్రీమియం, జియో హాట్ స్టార్ సూపర్ ప్లాన్ ఓటిటిలను ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా అందిస్తున్నామని తెలిపారు.

