జర్మనీ దేశస్థులకు ఘన స్వాగతం..
1 min read

ఘనంగా జపమాల మాత పండుగ..
మిడుతూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామానికి విచ్చేసినజర్మనీ దేశస్థులకు ఘన స్వాగతం లభించింది. ఉప్పలదడియ ఆర్.సీఎం విచారణ గురువులు డి మధుబాబు ఆధ్వర్యంలో “జపమాల మాత పండుగ”ను సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు.ముందుగా గ్రామానికి వచ్చిన 10 మంది జర్మనీ దేశస్థులను మేళతాళాల నడుమ ప్రత్యేక రథంపై మహిళలు పూలు చల్లుతూ మహిళలు కోలాటంతో గ్రామంలో భారీ ఊరేగింపుతో స్వాగతించారు. తర్వాత రాత్రి కేడిఎస్ఎస్ డైరెక్టర్ తోట జోసెఫ్ దివ్యబలి పూజను సమర్పించారు. అక్టోబర్ నెల మాసంలో మరియ తల్లిని స్మరించుకుంటూ జపమాలను చెప్పడం జరుగుతూ ఉందని మరియతల్లి గురించి వాక్య పరిచర్య చేశారు.తర్వాత జర్మనీ వారిని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కౌలూరు విచారణ గురువులు ఫాదర్ రవి,బిషప్ హౌస్ గురువులు మనోజ్,బ్రదర్ థోమాస్,సుపీరియర్ సిస్టర్ సహాయ రాణి మరియు విచారణలోని 10 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


