PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రి ముక్తర్​ అబ్బాస్​ సఖ్వీని కలిసిన రాజంపేట నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: జాతీయ మైనారిటీ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీని బుధవారం రాజంపేట పార్లమెంటు బి జె పి కార్యదర్శి ఆనందగజపతిరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో మంత్రి స్వగృహంలో కలిసిన ఆనంద గజపతి రాజు బక్రీద్​ పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆనందగజపతి రాజు మాట్లాడుతూ మైనారిటీ సంక్షేమానికి చేయూత అందించాలని కోరినట్లు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మైనారిటీ వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని, తప్పక సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

About Author