ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్య
1 min read

అధికవి నన్నయ యూనివర్సిటీలో జరిగిన క్రీడలలో ప్రధమ,తృతీయ బహుమతులు కైవసం
రాష్ట్రస్థాయిలో జరిగే యువజ నోత్సవాల్లో మా విద్యార్థులు ఎంపిక
ఏలూరు, న్యూస్ నేడు: కళాశాల ప్రిన్సిపల్ వంగా వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ, డి.ఆర్.డి.ఎ పిడి డా:ఆర్ విజయ రాజు ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఉన్నత విలువలతో కూడిన విద్యతో పాటు ఉద్యోగం,క్రమశిక్షణ, పలు సాంసృరితిక కార్యక్రమాల్లో విద్యార్థులను (ప్రోత్స హిస్తున్నట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా,వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 10,11 తేదీలలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలో జరిగిన అథ్లెటిక్స్లో మా విద్యార్థులు ఎండి. అమీనా డిస్కస్ లో బంగారు పతకాన్ని, జి.నరేంద్ర సిద్దు 1ONTR HRDలో కాంస్య పతకాన్ని సాధించగా, సెట్వెల్ వారు నిర్వహించిన జిల్లా యువజనోత్సవాల్లో మా విద్యార్థులు పలు అంశాల్లో పోటీ చేసి కూచిపూడి నృత్యంలో బి. బృంద ప్రథమ బహుమతి, చిత్ర లేఖనంలో సిహెచ్. గాయిత్రి ద్వితీయ బహుమతి, జానపద నృత్యం గ్రూపులో ఎ. కాంతి శ్రీ గ్రూపు ద్వితీయ బహుమతిని, వాయిద్యంలో ఎ. కైలాష్ ప్రోత్సాహక బహుమతిని కైవసం చేసుకోగా, రాష్ట్రస్థాయిలో జరిగే యువజనోత్సవాల్లో పాల్గొనుటకు జానపద నృత్యం గ్రూపు ఎంపికైనారని విజేతలను ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ డాక్టర్: నల్లమిల్లి శేషారెడ్డి, సెక్రటరీ నల్లమిల్లి సుగుణారెడ్డి, ఆకడమిక్ డైరెక్టర్ బి.వి.ఇ.ఎల్ నాయుడు అభినందించినట్లు (పిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిల్లాస్థాయి విజేతలైన విద్యార్థులకు డిఆర్డిఏ పిడి డా:ఆర్.విజయరాజు ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రశంసా పత్రాలు అందించారు.


