ఆపదలో ఆపన హస్తము అందించిన దెందులూరు ఎమ్మెల్యే
1 min read

నియోజకవర్గ పరిధిలోని పలువురు బాధితులకు స్వయంగా వారింటి వద్దకే వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత
మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించిన దెందులూరు ఎమ్మెల్యే
కర్నూలు, న్యూస్ నేడు: అనారోగ్యంతో బాధపడుతున్న పెదవేగి మండలం పెదకడిమి గ్రామంలో కూచిపూడి. కనకతాయారు గారికి రూ.50,227/-లు ఉండవల్లి. సీతారావమ్మ కి రూ.80000/- , దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో ఏరిపాక కృష్ణా కి రూ.42465/- ల సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరు చేయించిన చెక్కులను సోమవారం ఉదయం లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే అందజేశారు.అనంతరం దెందులూరు మండలం పోతునూరు గ్రామంలో పర్యటించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గ్రామ రహదారుల్లో చెత్త పేరుకుపోయి ఉండటం చూసి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్త సేకరణ పటిష్టంగా అమలు చేయాలని ఇప్పటికే పలుమార్లు ఆదేశించడం జరిగిన కూడా కొన్ని గ్రామాల్లో స్థానిక కూటమి నాయకులు, సంబంధిత అధికారులు సిబ్బంది ఉదాసీనత వ్యవహరిస్తున్నారని, గ్రామాల పరిశుభ్రత ,ప్రజల ఆరోగ్యం పట్ల ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఇకపై ఉపేక్షించబోమని, గ్రామాల్లో చెత్త తొలగింపును చిత్తశుద్ధితో అమలు చేయాలని , అదేవిధంగా తడి చెత్త పొడి చెత్తను కూడా వేరుచేసి సేకరించాలని, ఈ అంశంపై గ్రామాల్లో ప్రజలకు సైతం విస్తృతంగా అవగాహన కార్యక్రమం నిర్వహించాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్థానిక కూటమి నాయకులకు, సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు.

