NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క్యాన్సర్​ ను ప్రాథమిక దశలోనే గుర్తించాలి

1 min read

వ్యాధిపై అవగాహన పెంచుకోండి

  • ఓమేగా హాస్పిటల్​  మెడికల్​ ఆంకాలజిస్టు డా.సుదీర్​ రెడ్డి
  • అవగాహన ర్యాలీని ప్రారంభించిన డిఐజి విక్రాంత్​ పాటిల్​

  కర్నూలు హాస్పిటల్​, న్యూస్​ నేడు:   సమాజంలో క్యాన్సర్​ కేసులు అధికమవుతున్నాయని,  వ్యాధిపై అవగాహన పెంచుకొని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే నియంత్రించవచ్చని ఓమేగా హాస్పిటల్​ వైద్యులు, ప్రముఖ ఆంకాలజిస్టు డా. సుధీర్​ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్​ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఓమేగా హాస్పిటల్​ నుంచి నంద్యాల చెక్​ పోస్టు వరకు మెడికల్​ విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.  అంతకు ముందు నగరంలోని ఓమేగా హాస్పిటల్​ దగ్గర క్యాన్సర్​ పై అవగాహన ర్యాలీని డిఐజి, కర్నూలు ఇన్​చార్జ్​ ఎస్పీ విక్రాంత్​ పాటిల్​ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంకాలజిస్టులు డా. సుధీర్​ రెడ్డి  మాట్లాడుతూ  ప్రాణాంతక వ్యాధులపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. క్యాన్సర్‌పై భయం కాకుండా జాగ్రత్త అవసరమని, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా నిరంతరం పరీక్ష చేయించుకోవాలని  సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా ఈ వ్యాధి ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చన్నారు. అనంతరం ప్రముఖ ఆంకాలజిస్టు డా. భవాని మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్​ , గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్​ పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామీణ  ప్రాంత మహిళలు క్యాన్సర్​ పై అవగాహన లేక… చెప్పుకోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, అలా కాకుండా ప్రతి ఒక్కరూ క్యాన్సర్​ బాధితులకు మనోధైర్యమిచ్చి… చికిత్సకు సహకరించేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్​ సీఈఓ రవి కిరణ్​, మెడికల్​ డైరెక్టర్​ వై. వెంకట రామిరెడ్డి, చీఫ్​ రేడియాలజిస్టు వై. ఆదిత్య , సిబ్బంది తదితరులు ఉన్నారు.

About Author