మహాశివరాత్రి వేడుకల్లో వివేకానంద స్వామి కబడ్డీ టోర్నమెంట్ ఘన విజయం
1 min read

హోళగుందన్యూస్ నేడు: హొళగుంద మండలంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన వివేకానంద స్వామి కబడ్డీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్సాహభరితంగా, క్రీడాస్ఫూర్తి నిండుగా జరిగింది. గ్రామ యువతలో క్రీడాపై ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో ఈ టోర్నమెంట్ను అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమైంది. 1వ బహుమతి ₹30,000 + విన్నర్ కప్అద్భుతమైన జట్టు సమన్వయం, ధైర్యం పట్టుదలతో పోటీ చేసిన సిరిగిరి టీమ్ విజేతగా నిలిచి విన్నర్ కప్ను అందుకుంది.ఈ విన్నర్ కప్తో పాటు ₹30,000 నగదు బహుమతిని టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈబీజీ గోవింద్ గౌడ్ తనయుడు, యువనాయకుడు ఈబీజీ రాజేంద్ర గౌడ్ ఘనంగా అందజేశారు.2వ బహుమతి ₹20,000 + రన్నర్ కప్పోటీ చివరి వరకు ఉత్కంఠభరితంగా పోరాడిన SSF టీమ్ రన్నర్గా నిలిచి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.ఈ బహుమతిని వందవగాలి సర్పంచ్ శేషన్న మరియు ఎం.డి హాలి సర్పంచ్ సుధాకర్ అందజేశారు.3వ బహుమతి– ₹10,000 + కప్ఉత్సాహంగా పోటీ చేసి మూడవ స్థానం సాధించిన కేఎంటి టీమ్కు ₹10,000 నగదు బహుమతితో పాటు కప్ను శివప్రకాశ్ (లెజెండ్) అందించారు. ఇ కబాడీ టోర్నమెంట్ కి షీల్డ్ దాతలు. నాలుగవ బహుమతిని టీడీపీ యువనాయకులు కోగిలతోట రంగా గారు మరియు కోగిలతోట ప్రహ్లాద్ స్వామి అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని సూచించారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, ఐక్యత, పట్టుదల పెంపొందుతాయని పేర్కొన్నారు. గ్రామానికి మంచి పేరు తీసుకురావడంలో యువత ముందుండాలని ఆకాంక్షించారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంత గొప్ప స్థాయిలో కబడ్డీ టోర్నమెంట్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. హొళగుంద గ్రామంలో క్రీడా ఉత్సాహాన్ని మరింత పెంచిన ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది.

