NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ మహాయోగి మంగమ్మ అమ్మవారికి ఎమ్మెల్యే  ప్రత్యేక పూజలు

1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం, ఆలూరు మండలంకరిడిగుడ్డ గ్రామంకరిడిగుడ్డ గ్రామంలో శ్రీ మహాయోగి మంగమ్మ అమ్మవారి రథోత్సవం వైభవంగా, భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరపాక్షి శ్రీ మహాయోగి మంగమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.రథోత్సవ వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి, వేద మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు జరిపారు. ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసి, గ్రామ ప్రజల శ్రేయస్సు, నియోజకవర్గ అభివృద్ధి, సుభిక్షం కోసం ప్రార్థనలు చేశారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే బుసినే విరపాక్షి కి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, కరిడిగుడ్డ గ్రామంలో ఈ రథోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంపొందిస్తూ, భక్తుల మధ్య ఐక్యతను మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి మరియు ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మహిళలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. మొత్తం గ్రామం భక్తి వాతావరణంతో కళకళలాడింది.

About Author