మునిమడుగు రెవెన్యూ గ్రామములో రీ సర్వే ను ప్రారంభం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ప్యాపిలి మండలము మునిమడుగు రెవెన్యూ గ్రామము నందు రీ సర్వే ను ప్రారంభించారు. ఈ రి సర్వే నందు గ్రౌండ్ ట్రూథింగ్ మొదలు పెట్టారు.ఇందులో భాగంగా మునిమడుగు రెవెన్యూ గ్రామంలోని రైతులకు ముందుగానే నోటీస్ లను ఇచ్చి వారి వారి హక్కు పత్రాలతో హాజరు అయ్యి వారి యొక్క భూమి సరిహద్దులను చూపించుకొని సర్వే చేయించుకోగలరని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల తహశీల్దార్ మరియు డోన్ డివిజన్ డిఐఓఎస్ ,మండల సర్వేయర్ మరియు విలేజ్ సర్వేయర్లు వి.ఆర్.ఓ పాల్గొన్నారు.

