NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆలూరు అభివృద్ధిపై రెవిన్యూ మంత్రితో టిడిపి ఇన్‌చార్జ్ వైకుంఠ జ్యోతి భేటీ

1 min read

ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై సుదీర్ఘ చర్చ

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్ వైకుంఠ జ్యోతి రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారు.నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యలు, రెవిన్యూ సంబంధిత పెండింగ్ అంశాలు, ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి ముందుంచి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రైతులకు పట్టాదారు పాస్‌బుక్స్, భూ రికార్డుల సవరణ, సర్వే సమస్యలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించినట్లు సమాచారం.అలాగే ఆలూరు ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థ, ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై మంత్రి అనగాని సత్య ప్రసాద్‌తో విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వేగంగా చేరేలా చర్యలు తీసుకోవాలని వైకుంఠ జ్యోతి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *