ప్రతి ఇంట స్వదేశీ-ఇంటింటా స్వదేశీ నినాదంతో బిజెపి నాయకులు
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలో మంగళవారం బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రతి ఇంట స్వదేశీ-ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ఇంచార్జి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాజుల ఉషా లక్ష్మి ముఖ్య అతిథి మరియు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ మాట్లాడుతూ, స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల కలిగే ప్రయోజనాలను గురించి మరియు గోడ స్టిక్కర్లను అతికించి పాంప్లెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ చేసికే.సి. మద్దిలేటి, రామాంజనేయులు , చంద్రకళ, మామిళ్ళపల్లి మద్దిలేటి, మల్లికార్జున, ఓబుల్ రెడ్డి, సీతారాముడు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొ్నారు.

