NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు బ్రాహ్మణ కార్తీక వన భోజనం

1 min read

కర్నూలు , న్యూస్​ నేడు: కర్నూలు నగరం  సంకల్​ భాగ్​లోని హరిహర క్షేత్రం  వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో  ఆదివారం కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం  ఆధ్వర్యంలో కార్తీక వన భోజన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం జజిల్లా అధ్యక్షుడు సండేల్​ చంద్ర శేఖర్​ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ   ఉదయం స్వామి  అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 1 గంటకు కార్తీక వన భోజనం ఉటుందని పేర్కొన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా బ్రాహ్మణ కుటుంబీకులందరూ కార్తీక వన భోజన మహోత్సవంలో పాల్గొనాలని  ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సండేల్​ చంద్ర శేఖర్​ కోరారు.

About Author