గడియారం ఆసుపత్రి తనిఖీ..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ: కర్నూల్ పాతబస్తీలోని మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఉన్న గడియారం ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రికి సంబంధించిన డెవలప్మెంట్ మరియు మాన్ పవర్, వైద్య సిబ్బంది, వైద్య సేవల యొక్క వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు.ఆసుపత్రికి సంబంధించిన డెవలప్మెంట్ మరియు పేషెంట్లకు వైద్య సేవలు అందించడానికి నా వంతు గా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో I/C CSRMO, డా.వెంకటరమణ, అసిస్టెంట్ ప్రొఫెసర్, డా.కిరణ్ కుమార్, గడియారం ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్, డా.అమర్ తదితరులు పాల్గొన్నారు.

