శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న ఏలూరు ఎంపీ
1 min read

ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన సహాయ కమిషనర్, కార్య నిర్వహణ అధికారిణి ఆర్.వి.చందన
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ సోమవారం విచ్చేసి నారు. వీరికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారిని వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి నారు. అనంతరం శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు గావించినారు వీరికి వేద ఆశీర్వచనం గావించి స్వామివారి శేష వస్త్రములతో సత్కరించి చిత్రపటమును బహుకరించి తీర్థ ప్రసాదములు అందజేసినారు. అలాగే అనేక ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

