అమృత్ 2.0 నిధులతో ప్రారంభించనున్న మంచినీటి చెరువుల అభివృద్ధి పనులు
1 min read

మంచినీటి చెరువుల అభివృద్ధి పనులు ఫీల్డ్ వెరిఫికేషన్
ఇ యన్ సి మొగిలి ప్రభాకర్,
శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య,కో-ఆప్షన్ సభ్యులు
ఎస్ఎంఆర్ పెదబాబు పరిశీలన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమృత్ 2.0 నిధులతో ప్రారంభించనున్న మంచినీటి చెరువుల అభివృద్ధి పనులు ఫీల్డ్ వెరిఫికేషన్ లో భాగంగా బుధవారం ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఈయన్ సి మొగిలి ప్రభాకర్ నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులుఎస్ఎంఆర్ పెదబాబు మున్సిపల్ కమిషనర్ ఏ.భాను ప్రతాప్ ఇతర ఉన్నత అధికారులతో కలిసి ఏలూరు లో ఉన్న పంపుల చెరువును పరిశీలించారు.ఎమ్మెల్యే,మేయర్ సూచనలు ప్రకారం సాధ్యసాద్యాలు పరిశీలించి అమృత్ 2.0 నిధులు సరిపోకపోతే అమృత్ 3.0 నిధులు ఉపయోగించి ఎమ్మెల్యే,మేయర్ సూచనల ప్రకారం పంపుల చెరువులు అభివృద్ధి చేస్తామని ఈ యన్ సి మొగిలి ప్రభాకర్ తెలిపారు.


