మృతి చెందిన మీటే తండా సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: తుగ్గలి మండలం మీటేతాండ సర్పంచ్ రమావత్ బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో బుధవారము బాటతాండ గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులైన మాజీ ఉపసర్పంచ్ రాము నాయక్ లను మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట ఎస్టీ విభాగం రాయలసీమ జోనల్ ప్రెసిడెంట్ నారాయణ నాయక్,వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు జిట్టా నాగేశ్ యాదవ్,మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ రాంపల్లి నాగభూషణ్ రెడ్డి, జడ్పిటిసి పులికొండ నాయక్, పత్తికొండ నియోజకవర్గం ఎస్టీ విభాగం అధ్యక్షులు భీమా నాయక్ ,ఎంపిటిసి రామదాస్ నాయక్, స్థానిక వైసిపి రత్న నాయక్, తదితరులు పాల్గొన్నారు.

