ప్రజా సమస్యల పరిష్కార వేదికగా “గ్రీవెన్స్ సెల్”
1 min read
సమస్యల పరిష్కారమే లక్ష్యంగా
ఆలూరులో టిడిపి ప్రత్యేక కార్యక్రమం
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన “గ్రీవెన్స్ సెల్” (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమం గురువారం విజయవంతంగా ముగిసింది. ఆలూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి నాయకత్వం వహించారు.ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, గ్రామాభివృద్ధి సమస్యలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు, రైతు సమస్యలు తదితర అంశాలపై అర్జీలు సమర్పించారు. మహిళలు, రైతులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై తమ సమస్యలను నేరుగా నాయకురాలికి వివరించారు.అర్జీలను స్వీకరించిన వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. ప్రతి అర్జీని ప్రత్యేకంగా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రజలతో నేరుగా మమేకమవుతూ వారి ఇబ్బందులను తెలుసుకోవడం ద్వారా ప్రజా సేవకు మరింత బలం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం విజయవంతం కావడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమానికి హాజరై తమ సమస్యలను పంచుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఆలూరు నియోజకవర్గ ప్రజలందరికీ టిడిపి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

