ప్రజలు 11 సీట్లు ఇచ్చి ఇంటికి పంపిన ఇప్పటికీ తీరు మార్చుకొని జగన్
1 min read
రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఆరోపణ.
పల్లెవాణి, అమరావతి: రాష్ట్రంలో గడిచిన 24 మాసాలలో 100% మించి అభివృద్ధి సంక్షేమ పథకాలను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేసిందని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తూచా తప్పకుండా అమలు చేయడమే కాక ఎన్నికలలో ఇవ్వని హామీలను కూడా అమలు చేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందని ప్రజలలో కూటమి ప్రభుత్వానికి లభిస్తున్నటువంటి ఆదరణను చూసి జీర్ణించుకోలేక వైయస్ జగన్మోహన్ రెడ్డి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మాత్యులు కొల్లు రవీంద్ర గారు ఆరోపించారు ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం కర్నూల్ నందు నిర్వహించినటువంటి పత్రిక మరియు మీడియా ప్రతినిధుల సమావేశంలో శాసనసభ్యులు శ్రీ బి వి జయనాగేశ్వర్రెడ్డి, గౌరు చరిత రెడ్డి, మరియు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడటం జరిగిందిఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల తర్వాత పత్రికల వారి ముందుకు వచ్చిచంద్రబాబునాయుడు పైన కూటమి ప్రభుత్వము పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ తానేదో దేశోద్ధారకునీ లాగామాట్లాడారాణి, వారి మాట లలో ఇంకా మార్పు రాలేదని వారి అహంకారం తగ్గలేదని వారి మాటలను బట్టి తేటతెల్లమయింది. ఒకపక్క చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ నారా లోకేష్ గారు ప్రధాని మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంపై తీసుకుని వెళుతుంటే దానిని జీర్ణించుకోలేని జగన్ మోహన్ రెడ్డి తన పాత ధోరణినే అవలంబిస్తున్నారు గతంలో లాగే ప్రస్తుతం కూడా రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగము అమలు జరుపుతున్నట్లు ఫీల్ అవుతున్నారు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి భారతదేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరుకుంటుంటే జగన్ మాత్రం కళ్లుండి చూడలేని కబోదిలా మాట్లాడుతున్నారని అన్నారు.కల్తీ మద్యమం సంబంధించి జోగి రమేష్ చేసినటువంటి ఘాతకం బట్టబయలు కావడంతో దిక్కుతోచక వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగరాజుయ్దవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కే పార్వతమ్మ జిల్లా గ్రంథాలయం చైర్మన్ తుగ్గలి నాగేంద్ర,పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షులు సోమిశెట్టి శ్రీకాంత్ రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ సంజీవ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి పద్మలతారెడ్డి డి జేమ్స్ నంద్యాల నాగేంద్ర ఎల్ వి ప్రసాద్ వెంకట్ రాముడు ఎస్ ముంతాజ్ విజయకుమార్ సంజీవలక్ష్మి రవికుమార్ కే లక్ష్మీనారాయణ డాక్టర్ కె వి సుబ్బారెడ్డి బాలరాజ్ వినంది మధు పేర పోగురాజు సత్రం రామకృష్ణుడు,పి హనుమంతరావుచౌదరిముత్యాల తిరుపాల్ చంద్రకాంత్ అశోక్ కుమార్ రవిశర్మ కుంపటి కృష్ణ భేతం కృష్ణుడు మొదలగువారు పాల్గొన్నారు.

