హై రిస్క్ సర్జరీ.. సక్సెస్…
1 min read
పరిస్థితి విషమించేటప్పుడు ఆస్పత్రిలో చేరిన గర్భిణీ
- ఆపరేషన్ విజయవంతం చేసిన అమీలియో వైద్యులు
- తల్లీ బిడ్డ క్షేమం..
- అభినందించిన హాస్పిటల్ ఎం.డి డా. లక్ష్మీ ప్రసాద్ చాపే
కర్నూలు హాస్పిటల్,న్యూస్ నేడు:అధిక రక్తస్రావం.. ప్లేట్ లెట్ కణాలు తగ్గిపోవడం.. రక్త పోటు కంట్రోల్ లేని సమయంలో ఆస్పత్రిలో చేరిన ఓ గర్భిణీకి విజయవంతంగా ఆపరేషన్ చేసి … కుటుంబీకుల మన్ననలు పొందారు అమీలియో ఆస్పత్రి వైద్యులు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి గైనకాలజిస్ట్ డా. మాబూని , అనస్థియా వైద్యులు డా. విజేత తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన గర్భిణీ స్వప్న మూడు రోజుల చికిత్స కోసం కర్నూలు నగరం అమీలియో ఆస్పత్రిలో చేరింది. అప్పటికే పలు ఆస్పత్రులలో చేర్పించేందుకు ప్రయత్నించినా..ఆయా ఆస్పత్రులు హై రిస్క్ సర్జని అని … అడ్మిట్ చేయించుకోలేదని భర్త రాజు తెలిపారు. ఆపరేషన్ సమయంలో గర్భిణీ స్వప్న ప్లేట్ లెట్ కణాలు లక్షా 50వేలు ఉండాల్సి ఉండగా 20వేలు మాత్రమే ఉన్నాయి. బీపీ 200/140 తోపాటు అధిక రక్త స్రావంతో బాధపడుతూ ఉంది. వాటన్నిటినీ కంట్రోల్ చేస్తూ… ఆపరేషన్ ను పూర్తి చేశామని, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని గైనకాలజిస్ట్ డా. మాబూని వెల్లడించారు.
వైద్యులకు అభినందన
నగరంలోని అమీలియో హాస్పిటల్ లో హై రిస్క్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ చాపే తెలిపారు. ఈ నెల 3న కడుపునొప్పితో బాధ పడుతున్న 12 ఏళ్ల బాలికకు రిసిక్షన్ అండ్ అనాస్టమోసిస్ ఆపరేషన్ చేసి.. ఆ బాలికకు కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలిగించామన్నారు. ప్రస్తుతం హై రిస్క్ లో ఉన్న గర్భిణీకి మనోధైర్యమిచ్చి… ఆపరేషన్ ను సక్సెస్ చేసిన గైనకాలజిస్ట్ వైద్యులు డా. మాబూని, అనస్థీయా వైద్యులు డా. విజేతకు ఈ సందర్భంగా ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ అభినందనలు తెలిపారు.

