రోడ్డు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి టీజీ భరత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా పత్తికొండలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోవడం తనను ఎంతో బాధ కలిగించిందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన వైద్యులను ఆదేశించారు.

