NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రూ.150 కోట్లు సమీకరించిన మోతీసన్స్ జ్యువెలర్స్

1 min read

 క్యూఐపీ ద్వారా నిధుల సమీకరణ.. విదేశీ, ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధుల భాగస్వామ్యం

 హైదరాబాద్, న్యూస్​ నేడు: ఆభరణాల రిటైల్ రంగంలో ప్రముఖ సంస్థ మోతీసన్స్ జ్యువెలర్స్ లిమిటెడ్ క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా రూ.150 కోట్ల నిధులను సమీకరించింది. జూన్ 11న జరిగిన డైరెక్టర్ల మండలి సమావేశంలో ఇందుకు ఆమోదం తెలిపింది. ఒక్కో ఈక్విటీ షేరును రూ.11.05 ధరకు కేటాయిస్తూ మొత్తం 13,57,46,600 ఈక్విటీ షేర్లను అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు కేటాయించింది.ఈ కేటాయింపుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు అయిన పైన్ ఓక్ గ్లోబల్ ఫండ్, మింట్ ఫోకస్డ్ గ్రోత్ ఫండ్ పిసిసి-సెల్ 1, సెయింట్ క్యాపిటల్ ఫండ్, నోవా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఫండ్ పిసిసి-టచ్‌స్టోన్తో పాటు ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులు అయిన కాంపాక్ట్ స్ట్రక్చర్ ఫండ్, టైగర్ స్ట్రాటజీస్ ఫండ్-I పాల్గొన్నారు.ఇటీవల ముగిసిన 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంస్థ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఎఫ్ వై 26లో మొత్తం ఆదాయం రూ.495.84 కోట్లు నమోదు కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 7.12 శాతం వృద్ధి సాధించింది. పన్నుల అనంతర లాభం రూ.63.71 కోట్లు నమోదు చేసి, ఎఫ్ వై 25లోని రూ.43.17 కోట్లతో పోలిస్తే 47.57 శాతం పెరుగుదల కనబరిచింది. ప్రతి షేరుపై ఆదాయం రూ.0.65గా నమోదైంది.దాదాపు 25 ఏళ్ల చరిత్ర కలిగిన మోతీసన్స్ జ్యువెలర్స్ బంగారం, వజ్రాలు, కుందన్ ఆభరణాలతో పాటు ముత్యాలు, వెండి, ప్లాటినం, ఇతర విలువైన లోహాలతో తయారైన ఉత్పత్తులను విక్రయిస్తోంది. బంగారం, వెండి నాణేలు, పూజా సామగ్రి, అలంకార వస్తువులు కూడా సంస్థ ఉత్పత్తుల జాబితాలో ఉన్నాయి.సంస్థ వద్ద మూడు లక్షలకు పైగా డిజైన్లు అందుబాటులో ఉండగా, వివాహాలు, పండుగలు, ప్రత్యేక సందర్భాలు, రోజువారీ వినియోగం, పిల్లలు మరియు పురుషుల కోసం ప్రత్యేక కలెక్షన్లను అందిస్తోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లను రూపొందించడం సంస్థ ప్రత్యేకతగా పేర్కొంది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *