టీడీపీ నేత కారుమూరి దుర్గారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఎంపీ
1 min read
నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు అధికారులపై చర్యలు
న్యాయం చెయ్యాలని దుర్గారెడ్డి కుటుంబ సభ్యులు
ఏలూరుజిల్లా ప్రతినిది,న్యూస్ నేడు: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో దుర్గారెడ్డి భౌతికకాయానికి ఎంపీ నివాళులు అర్పించారు.జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తతనెలకొoది.తమకు న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు,అధికారులపై చర్యలు తీసుకోవాలని దుర్గారెడ్డి కుటుంబ సభ్యులుకోరారు.తనకు ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్పినా పట్టించుకోని పోలీసుల తీరుపట్ల దుర్గారెడ్డి కుటుంబ సభ్యులు, పార్టీ నేతల ఆగ్రహం వ్యక్తిoచేశారు. హత్య వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందని టీడీపీ నేతల ఆరోపణలుచేశారు.దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ.ఓదార్చరు.సంఘటన వివరాలను పార్టీ నేతలను ఎంపీ అడిగి తెలుసుకున్నరు.దర్యాప్తు చేసి,నిందితులకు శిక్ష పడేట్లు చేయడంతోపాటు, అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని ఇచ్చిన ఎంపీ పుట్టా మహష్ హామీఇచ్చరు.


