మంత్రి నారా లోకేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కుమ్మరి సుధాకర్
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: టీడీపీ కేంద్ర కార్యాలయం లో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ని రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు.రాష్ట్రము లో కుమ్మరులు సామాజికంగ ,ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు .కావున కుమ్మరులకు కుల వృత్తి దారులకు ఆదరణ 3.0 పతకం లో ఎలక్ట్రానిక్ పనిముట్లు అందించాలని అలాగే కార్పొరేషన్ ద్వారా రాయితి రుణాలు ఏర్పాటు చేయాలనీ కోరడం అయినది. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలో ఆదరణ పతకం అమలు చేసి రాయితి రుణాలు కార్పొరేషన్ ద్వారా అమలు చేసి కుల అభివృద్దికు ప్రభుత్వ తొడ్పాటు. ఉంటుంది అని తెలియజేసారు.

