ముఖ్యమంత్రి సహాయ నిధి చేక్కులు పంపిణీ
1 min read
ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన మొత్తం 10,80,426/- (అక్షరాలా పది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు )విలువైన చెక్కులను డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ప్రభుత్వం కూటం ప్రభుత్వమని పేదలను ఆదుకునే ప్రభుత్వం కూటమే ప్రభుత్వ మే అని పేదవారికి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెదేపా మండల ఇంచార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజా రేణుక, తెదేపా మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి మధు, ముస్లిం మైనార్టీ నాయకులు కాజా పీర్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, తెదేపా నాయకులు గడ్డం ప్రసాద్ రెడ్డి, రాజనారాయణమూర్తి, సీమా సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ మధు, ఎస్ కే వలి, చల్లా వీరాంజనేయులు, తదితరులు కూటమి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.


