జాబ్ మేళాలో 96 మంది ఎంపిక
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, అందుకు ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్సూమర్ ప్రొడెక్ట్ లిమిటెడ్ కంపెనీ వారు మ్యానుప్యాక్టురింగ్ ఆపరేటర్ ఉద్యోగం కొరకు ఈ నెల 6,7వ తేదీన జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జాబ్మేళాలో భాగంగా ఇంటర్వ్యూ నిర్వహించామని, అందులో 269 మంది పాల్గొనగా 96 మంది ఎంపిక అయినట్లు జిల్లా ఉపాధి అధికారిణి పి. దీప్తి తెలిపారు.

