PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాక్ట‌రీలో పేలుడు.. 13 మంది మృతి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఢిల్లీ సమీపంలోని యూపీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుమారు 13 మంది మృతి చెందగా.. ఆరుగురు గాయపడనట్లు తెలిపారు. ఈ ఘటన పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఫ్యాక్టరీలో చోటు చేసుకుంది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో సుమారు 30 మంది ఇన్నారని పోలీసులు తెలిపారు. ఈ పేలుడు తాకిడికి చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు దెబ్బతిన్నాయని చెప్పారు. ఐతే ఈ ఫ్యాక్టరీకి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కోసం లైసెన్స్ ఇస్తే ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం బాణసంచా తయారు చేస్తున్నామని చెబుతుండటం గమనార్హం.

                                              

About Author