PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు సంఘీభావం తెలిపిన యూత్ నాయకుడు

1 min read

– హోళగుంద మండలం యూత్ నాయకుడు మంజునాథ్ గౌడ్

పల్లెవెలుగు వెబ్ ప్రకాశం:  ప్రకాశం జిల్లా, కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గం లో కొనసాగుతున్న 158వ రోజు యువగళం పాదయాత్ర లో హోలగుంద మండల యూత్ నాయకుడు మంజునాథ గౌడ్ పాల్గొని నారా లోకేష్ కి సంఘీభావం తెలియజేశారు. మంజునాథ్ గౌడ్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తినిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు వైసీపీ ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న నారా లోకేష్కి అభినందనలు తెలియజేశారు. త్వరలో మంజునాథ్ గౌడ్ చేపట్టబోయే టిడిపి కార్యక్రమాలకు నారా లోకేష్కి వివరించి పలు సలహాలు, సూచనలు , తీసుకోవడం జరిగింది అని మంజునాథ్ గౌడ్ తెలియజేశారు.

About Author