NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మలేరియా నిర్మూలనకు కృషి చేయాలి…

1 min read

ఈనెల 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు

జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : దోమలు వ్యాప్తిచెందకుండా తద్వారా జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చాలని జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి తెలిపారు.  సోమవారం చింతలపూడి తహశీల్దారు కార్యాలయంలో ఈనెల 30వ తేదీ వరకు నిర్వహించే మలేరియా నివారణ మాసోత్సవాలు సందర్బంగా ముద్రించిన మలేరియా మాసోత్సవ గోడ పత్రికలను, కరపత్రాలను ఆమె ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ థాత్రిరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ఇంటిపరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. నిల్వనీటిలో దోమలు వృద్ధిచెందకుండా లార్వీసైడ్ మందులు స్ర్పే చేయాలన్నారు. డ్రై డే లను పాటిస్తూ నీటి నిల్వలు లేకుండా చూడాలన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో నూజివీడు సబ్ కలెక్టర్ బి. స్మరణ్ రాజ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా ఆర్.మాలిని, చింతలపూడి సబ్ యూనిట్ మలేరియా అధికారి ఎన్. ఏ. ప్రసాద్, రాఘవాపురం, ఎర్రగుంటపల్లి వైద్యధికారులు కె. నరేష్.,చైతన్య, ఎమ్. పి. హెచ్. ఇ ఓ శ్రీనివారరావు, సూపెర్వైసర్ లు రవి, ప్రమీలకుమారి, మలేరియా హెల్త్ అసిస్టెంట్ కె. శ్రీనివాసరావు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *