సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నేడు కర్నూలు జిల్లా విద్యాధికారి కార్యాలయం ను ముట్టడి చేయడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నేడు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం లో ఉన్న విద్యాధికారి కార్యాలయం ను ముట్టడి చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు మరియు అపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ లు సేవా లాల్ నాయక్(ఆప్టా ), ఇస్మాయిల్ (ఎ పి టి ఎఫ్ 1937) అధ్యక్షత వహించారు.ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన సెకండరీ గ్రేడ్ టీచరు ప్రాధాన్యత క్రమం లో సుమారుగా 3500 ఖాళీ లు ఆప్షన్ గా ఇవ్వవలసి ఉంటుంది. జిల్లా పై పూర్తి అవగాహన ఉన్న వారు మాత్రమే ఆప్షన్ ఇవ్వగలరు. లేకపోతే ఇవ్వలేరు.అపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా లో మహిళా సెకండరీ గ్రేడ్ టీచర్లకు వెబ్ ఆప్షన్ అనేది ఒక రోజు లో ఇవ్వటం కష్టం పొరపాటు జరిగితే రెండు సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించవలసి రావచ్చు అని చెప్పారు. కాబట్టి సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి, అంతవరకు ఈ ఉద్యమం ఆగదు అని చెప్పారు. యు టి ఎఫ్ రాష్ట్ర సహా అధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ అవసరం అయితే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేసి మాన్యువల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తామని అన్నారు.ఈ కార్యక్రమం లో యు టి ఎఫ్ నుండి రవి కుమార్, నవీన్ పాటిల్, యెహోషువ, సుధాకర్, ప్రసాద్, రామక్రిష్ణ, హేమంత్ కుమార్ ఎస్ టి యు నుండి గోకారి, జనార్ధన్, సుంకన్న, వీర చంద్ర యాదవ్ పి ఆర్ టి యు నుండి కృష్ణా రెడ్డి, ధనుంజయ, రవి ప్రకాష్, రామ పక్కిర్ రెడ్డి, సయ్యద్ చాంద్, భాస్కర్ రెడ్డి ఎ పి టి ఎఫ్ 257 నుండి కె వి శివయ్య, పరశురాం, మధు ఎ పి టి ఎఫ్ 1937 నుండి మరియానందం, రామ కృష్ణ, సాంబ శివుడు, నగరి శ్రీనివాస్, మాధవ స్వామి ఆప్టా నుండి మధుసూదన్ రెడ్డి, రాజ సాగర్, రఫీ, మహబూబ్ బాషా, వినోద్, మహేశ్ బాబు అపస్ నుండి నాగస్వామి, నాగిరెడ్డి ఎస్ జి టి ఎఫ్ నుండి లక్ష్మయ్య, రాజ శేఖర్ పి ఈ టి అసోసియేషన్ లక్ష్మయ్య వై ఎస్ ఆర్ టి ఎ నుండి ప్రతాప్ రెడ్డి హెడ్ మాస్టర్ అసోసియేషన్ నుండి శ్రీనివాస్ మొదలైన నాయకులు మరియు అనేక మంది మహిళ ఉపాధ్యాయ ఉద్యోగులు పాల్గొనటం జరిగింది.
