PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  మనందరి ఆరోగ్యం కోసం మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అన్నారు. మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ లో భాగంగా బుధవారం పత్తికొండ పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ జిల్లా టిడిపి అధ్యక్షులు చేతికారెడ్డి ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి స్థానిక సర్పంచ్ కొమ్ము దీపిక ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే శ్యాం కుమార్ స్వయానా దోమల నివారణ మందును పిచికారి చేశారు. పరిసరాల అపరిశుభ్రత వలనపరి దోమలు వ్యాప్తి చెంది డెంగ్యూ మలేరియా గిఫ్తీరియా లాంటి జబ్బులు వ్యాపిస్తాయని తెలిపారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రజలు తమ అoదరి బాధ్యతగా భావించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు  సాంబశివరెడ్డి మరియు గ్రామపంచాయతీ ఈవో నరసింహులు, మరియు పారిశుద్ధ్య కార్మికులు, టిడిపి నాయకులు తదితరులు  పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *