PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా పరిషత్ లో 2024 స్వచ్ఛత హి సేవ కార్యక్రమం

1 min read

జిల్లా పరిషత్ చైర్మన్ ఘంటా పద్మశ్రీ,డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతి, సిబ్బంది  ప్రతిజ్ఞ

మన పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : జిల్లా పరిషత్ లో స్వచ్ఛతా హి సేవ జిల్లా పరిషత్ కార్యాలయంలో  గురువారం స్వచ్ఛత హి సేవ 2024 కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొని ప్రతిజ్ఞ చేయించారు.   ఈ సందర్బంగా జడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ మనతో పాటు మన ఇంటిని మన గ్రామాలను, జిల్లాలను, రాష్ట్రలను పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయించాలని అలా చేసిన నాడే మన గ్రామం నుంచి రాష్ట్రం వరకు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ను సాధించగలవారమని అందుకు మనం అందరం ముందు అడుగు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మొదటి స్థానంలో ఉండేలా కృషిచేయాలనీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ సిఈఓ కె.ఎస్.ఎస్ సుబ్బారావు, జడ్పీ డిప్యూటీ సిఈఓ  ఎస్ నిర్మల జ్యోతి, జిల్లా పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *