PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలమందలపాడులో..”ఇది మంచి ప్రభుత్వం”

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందలపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని గ్రామ టిడిపి సీనియర్ నాయకులు సర్వోత్తమ్ రెడ్డి  ఆధ్వర్యంలో “ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమంలో భాగంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన కుటుంబాల ఇండ్లకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సర్వోత్తమ్ రెడ్డి,యనబోతుల కృష్ణ మరియు పంచాయితీ కార్యదర్శి శ్రీధర్,డిజిటల్ అసిస్టెంట్ పాల్గున,గ్రామ సర్వేయర్ జుబేర్,తేజేశ్వర్ ఫీల్డ్ అసిస్టెంట్ మధు తదితరులు మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను అతికించారు.అంతే కాకుండా వంద రోజుల్లోనే సంక్షేమ పథకాలను మరియు చెప్పిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన మొదటి నెలలోనే ఒకేసారి పింఛన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందని సర్వోత్తమ్ రెడ్డి ప్రజలతో అన్నారు.అంతే కాకుండా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి మీ దీవెనలు ఉండాలని ఆయన ప్రజలను కోరారు.

About Author