PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హిందువుల మనోభావాలు..దెబ్బతినేలా జగన్ ప్రవర్తన

1 min read

సీఎం..డిప్యూటీ సీఎం సహకారంతో గ్రామాల అభివృద్ధి

పాత్రికేయుల సమావేశంలో నందికొట్కూరు ఎమ్మెల్యే..

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రవర్తిస్తున్నారని నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పై విరుచుకు పడ్డారు. నందికొట్కూరు పట్టణంలో సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో ఎమ్మెల్యే పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ 2019-2024 వరకు అన్ని విధాలుగా రాష్ట్రాన్ని సంక్షోభంలోకి జగన్ తీసుకువెళ్లారని తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షోభం నుండి అభివృద్ధి వైపు వెళ్తోందని చదువుకున్న యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కొరకు మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని గతంలో గ్రామ పంచాయతీలను జగన్ కొల్లగొట్టారని అన్నారు. ప్రతి మండలానికిరెండు కోట్ల 50 లక్షలు నిధులు మంజూరు చేయడం జరుగుతుందని గ్రామాల్లో గత టిడిపి ప్రభుత్వ హయాంలో వేసిన ఎల్ఈడీ బల్బులే నేటికీ వెలుగుతున్నాయని కానీ గ్రామాల్లో సర్పంచులు గానీ పంచాయతీ కార్యదర్శులు గానీ ఒక బల్బు వేయలేదని అన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి చేయడం వల్లే ఆయన ఆలయంలోకి రావాలంటే డిక్లరేషన్ ఇవ్వమంటే ఇవ్వకుండా ఆయన రాజకీయాలు చేస్తున్నారని రాజకీయాలు మతాలు వేరు అంటూ నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి,టిడీపీ నాయకులు పలుచాని మహేశ్వర్ రెడ్డి,క్లస్టర్ ఇన్చార్జీలు లాయర్ జాకీర్ హుస్సేన్,ముర్తుజావలి,ఎస్ ఎండీ జమీల్ పాల్గొన్నారు.

About Author