PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీ బాల త్రిపురసుందరీ దేవి అలంకరణలో అమ్మవారు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి :   నవరాత్రులలో భాగంగా దసరాఉత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం రెండవ రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపురసుందరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారని ప్యాపిలి ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు రాజా మురళీకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసర శరన్నవరాత్రుల సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని స్థానిక అమ్మవారిశాల నందు శ్రీవాసవీ అమ్మవారిని బాల త్రిపురసుందరీ దేవి అలంకరణ చేయడం జరిగిందన్నారు. అలాగే శరన్నవరాత్రులను పురస్కరించుకొని అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారి వివిధ రూపాలలో సుందరంగా అలంకరించడం జరుగుతుందన్నారు. అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆయన తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *