మహానంది క్షేత్రంలో వరలక్ష్మి వ్రతం ప్రారంభం
1 min read

మహానంది, న్యూస్ నేడు: మహానంది క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం ప్రారంభం అయింది. మహానంది మండల తాసిల్దార్ రమాదేవి, ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్షేత్రంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం వరలక్ష్మి వ్రతానికి శ్రీకారం చుట్టారు. వేదమంత్రోచరణాలు మంగళ వాయిద్యాల మధ్య వ్రతాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.


