శ్రీరాముని దేవాలయానికి మైక్ సెట్ అందజేత
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి పట్టణంలోని బండగీరిలో ఉన్న శ్రీరాముల దేవాలయానికి గ్లోబుల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో దేవాలయంలో భక్తి గీతాలు గాను మైక్ సెట్ ను విరాళంగా అందజేశారు. వీటి విలువ సుమారు 16 వేలు విలువ ఉంటుందని వారు తెలిపారు. భక్తులు మైక్ సెట్ అందించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క హిందువు హిందూ ధర్మాన్ని పాటించాలని అలాగే పురాతనమైన దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకొని ప్రతి ఒక్క హిందువు దేవాలయాలను చక్కదిద్దుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

