మాధవరం బెస్తా రామకృష్ణకు సన్మానం..
1 min read

మంత్రాలయం న్యూస్ నేడు: మండల పరిధిలోని మాధవరం గ్రామానికి చెందిన బెస్త రామకృష్ణ ఇటివల సివిల్ కానిస్టేబుల్ కు ఎంపికయ్యారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి తన కార్యాలయంలో శాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆదివారం మాధవరం లో తన కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు సీఎం నారా చంద్రబాబు పాలన ఓ వరమని తెలిపారు. అలాగే మంత్రాలయంలో టిడిపి ఇంచార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి పాలన ఆదర్శం అంటు వారికి శాలువా పూలమాల వేసి సన్మానించిన నూతన సివిల్ కానిస్టేబుల్ బెస్త.రామకృష్ణ. యువత కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే మాటకు ఓ నిదర్శనం మాధవారం బెస్తా రామకృష్ణ రాఘవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బారికి ఉరుకుందు తదితరులు ఉన్నారు.

