రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరి కి గాయాలు
1 min read

ప్యాపిలి, న్యూస్ నేడు: ప్యాపిలి మండల పరిధిలోని పెద్ద పూజార్ల గ్రామ శివారులో బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ప్యాపిలి పోలీసుల వివరాల మేరకు ప్యాపిలి మండలంలోని చిన్ని పూజార్ల గ్రామం నుంచి ప్యాపిలికి ద్విచక్ర వాహనంపై లక్ష్మి ప్రసాద్, తండ్రి విజేయుడు, తమ్ముడు రవి ప్యాపిలి కి వస్తుండగా పెద్ద పూజార్ల గ్రామ శివారులో ప్యాపిలి నుంచి బోలెరో వాహనం ద్విచక్ర వాహనని ఢీ కొన్నది. డ్రైవింగ్ చేస్తున్న లక్ష్మీప్రసాద్( 25) అక్కడికక్కడే మృతి చెందగా తండ్రి విజేయుడు కి తమ్ముడు రవికి గాయలు కాగ వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించినట్లు, వీటిపై ప్యాపిలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్ చేపట్టినట్లు వారు తెలిపారు. ఒకే ఇంట్లో ఈ విషాదం నెలకొలవడంతో చిన్న పూజర్ల గ్రామంలో విషాయాలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు కాగా చూస్తున్న వారు కూడా కంటతడి పెట్టారు.


