NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బైక్ అదుపుతప్పి యువకుడు దుర్మరణం..

1 min read

నందికొట్కూరు, న్యూస్​ నేడు:  బైకుపై వెళ్తున్న యువకుడు అతి వేగంగా వెళ్లడంతో బైకు అదుపుతప్పి కిందపడడంతో యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరు ఎస్సై పి తిరుపాలు తెలిపిన వివరాల మేరకు బుధవారం సాయంత్రం 4:30 సమయంలో కర్నూలు మండలం భూపాల్ నగర్ గ్రామానికి చెందిన ఎస్ మహమ్మద్ భాష (35) తన ద్విచక్ర వాహనం(ఏపీ 39 కేజే 3963)పై భూపాల్ నగర్ నుండి నందికొట్కూరు కు వస్తూ ఉండగా బ్రాహ్మణ కొట్కూరు సర్వీస్ రోడ్ దగ్గర బైకు అతివేగంగా రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఈ ప్రమాదంపై ఫిర్యాదు రాలేదని  ఎస్ఐ తెలిపారు.

About Author