రెండోసారి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకున్న కళ్యాణి మేడం
1 min read

పత్తికొండ , న్యూస్ నేడు: కర్నూలు జిల్లా, పత్తికొండ మండలం, జే ఎం తాండా మజారా గ్రామం లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కళ్యాణి రెండోసారి జిల్లా స్థాయి ఉత్తమ అవార్డు అందుకుంది. శనివారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో సునయన ఆడిటోరియం లో ఏర్పాటుచేసిన అవార్డుల ప్రధానం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష చేతుల మీదుగా అవార్డును అందుకుంది. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, కర్నూలు డీఈవో శామ్యూల్, జిల్లా ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

