పండ్లతోటల పెంపకంపై రైతులకు అవగాహన..
1 min read

హొళగుంద న్యూస్ నేడు : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం హోళగుంద మండలం కోగిలతోట గ్రామంలో రైతు బసవరాజు పొలంలో ఈరోజు పండ్లతోటల పెంపకంలో భాగంగ టెంకాయ మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కె. నాగరాజ్ టెక్నీకల్ అసిస్టెంట్ మల్లన్న ఫీల్డ్ అసిస్టెంట్ రామలింగప్ప, సీనియర్ మేటి యంకప్ప, టీడీపీ యువ నాయకుడు బోయ రంగన్న, టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

