ఒకే రోజున లక్ష కిలోల బియ్యం విరాళం…
1 min read
రికార్డు సృష్టించిన లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్
హైదరాబాద్, న్యూస్ నేడు : లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ యొక్క సాంకేతిక కేంద్రం లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమాజం కోసం అతి పెద్ద కార్యక్రమం నిర్వహించింది. ఒకే రోజులో 1,00,000 కిలోల (ఒక లక్ష) బియ్యం విరాళంగా ఇవ్వడం ద్వారా దేశీయ రికార్డు సృష్టించింది. ఈ విరాళం హైదరాబాద్లోని వివిధ ఎన్జీవోలకు పంపిణీ చేయబడింది.ఉద్యోగులు ముందుగా 50,000 కిలోల బియ్యం దానం చేశారు, ఆ తర్వాత సంస్థ అదే మొత్తం 50,000 కిలోలతో మించి మొత్తం 1,00,000 కిలోలు చేరింది. ఈ విరాళం 55 ఎన్జీవోల కేంద్రాల ద్వారా వేలాది లబ్థిదారులకు చేరింది.ఈ సందర్భంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ శిరీష ఓరుగంటి మాట్లాడుతూ “మన బిజినెస్ విజయం మాత్రమే కాదు, సమాజంలో మన ప్రభావం నిజమైన అభివృద్ధిని తార్కాణం. ఈ కార్యక్రమం మన విలువలను చూపిస్తుంది. అందరూ కలిసి ఒకే గొడుగు కింద కలిసికట్టుగా పని చేసినందుకు గర్వంగా ఉంది” అన్నారు.కంపెనీ డైరెక్టర్ & హెచ్ ఆర్ విభాగధిపతి డా. విపుల్ ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ భవిష్యత్తులో కూడా సామాజిక కార్యక్రమాలను కొనసాగించనున్నట్లు తెలిపారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ గురించి:
హైదరాబాద్లోని ఎల్ టి సి, లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ యొక్క ఇండియా సాంకేతిక కేంద్రం. ఇది ఏఐ, క్లౌడ్, డేటా అనలిటిక్స్, సైబర్సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతికతల ద్వారా గ్లోబల్ డిజిటల్ మార్పును ముందుకు నడుపుతోంది. 3,800కి పైగా ఉద్యోగులతో ఎల్ టి సి ఇన్నోవేషన్ మరియు సమగ్ర వృద్ధిని ప్రోత్సహిస్తోంది.


