పేదల సేవలో కూటమి ప్రభుత్వం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వైకుంఠం శివప్రసాద్ ఆదేశాలతోఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హెబ్బటం గ్రామ టీడీపీ కూటమి నాయకులు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు హొళగుంద మండలసింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద మండలం హెబ్బటం గ్రామం నందు ఆలూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ K. గోపాల్,టీడీపీ యూనిట్ ఇంచార్జ్ బి.సవారప్ప, టీడీపీ బూత్ ఇంచార్జ్ లు, బి. మల్లికార్జున,శేక్షవలి,బీజేపీ కాళప్ప,పిన్ని కృష్ణ,గ్రామ ఉపాధ్యక్షులు సూగురు నాగయ్య,గ్రామ కార్యదర్శి మాణిక్య,బూత్ కో కన్వీనర్ రవి, మాట్లాడుతూ వృద్దులకు ,వితంతువులకు, వికలాంగులకు మరియు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వాళ్లకు కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాల ద్వారా గ్రామలలో ఇంటి వద్దనే పింఛన్ అందిస్తున్నారు,మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేధ శక్తితో పెట్టుబడులు వస్తున్నాయి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ,రాష్ట్రానికి ఆదాయం తో అభివృద్ధి సంక్షేమం అందిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమములో కూటమి నాయకులు సచివాలయం సిబ్బంది పాల్గొనడం జరిగినది.

