ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
1 min read

హొళగుంద న్యూస్ నేడు : నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా….ఆలూరు తాలూకా టీడీపీ ఇంచార్జ్ శ్రీమతి వైకుంఠం జ్యోతి మేడం ఆదేశాల మేరకు….హొళగుంద మండలం హెబ్బటం గ్రామం స్థానిక జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నందు నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా విచ్చేసిన సర్పంచ్ కృష్ణవేణి, మరియు టీడీపీ నాయకులు బి సవారప్ప, మల్లికార్జున, ఆర్మీ అంజి,మాట్లాడుతూ…దివ్యాంగుల యొక్క ఆత్మవిశ్వాసం, ధైర్యం మరియు నిబద్ధత సమాజంలో ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం, అని అన్నారు.అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు సమాన అవకాశాలు, గౌరవం మరియు భద్రత కల్పించడానికి కట్టుబడి ఉంది. వారి సాధికారత కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు మరియు పథకాలను మరింత బలోపేతం చేస్తున్నాం అని ఈ సందర్బంగా తెలియజేయడం జరిగింది.

