ఎస్ బి పి ఎల్ క్రికెట్ స్టేట్ కమిటీలో ఎన్నికైన క్రీడాకారుడు ఇలియాస్
1 min read

పత్తికొండ, న్యూస్ నేడు: డిసెంబర్ 20వ తేదీన కర్నూల్ లో జరిగిన క్రికెట్ సెలెక్షన్స్ లో ఎస్ బి పి ఎల్ కు పత్తికొండ, ముస్లిం వీధికి చెందిన ఇలియాస్ భాష స్టేట్ క్రికెట్ టీంకు ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు బెంగళూరులోని నాగరత్నం స్టేడియంలో జరిగే సౌత్ భారత్ లో ఆరు టీములు ఆడనున్నాయని, ఈ టీములతో కలిసి ఇలియాస్ భాష కూడా ఆడతారని తెలిపారు. స్టేట్ క్రికెట్ టీంకు పత్తికొండ తిరుగాకారడు ఎన్నిక కావడం పట్ల స్థానికంగా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. పత్తికొండలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారని క్రీడలో ఉత్సాహం చూపించే క్రీడాకారులకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలని నేను సౌత్ భారత్ క్రీడల్లో ఎన్నికవ్వడం ఎంతో సంతోషకరమని ఎస్ బి పి ఎల్ నేను ఆడి నా ప్రతిభను చూపించి పత్తికొండ పట్టణానికి మంచి పేరు తీసుకొస్తానని ఇలియాస్ చెప్పారు.

