NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తిశ్రద్ధలతో శివ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  శ్రీశైలం శివ దీక్ష (అన్నప్రసాద) సేవా సమితి ఆధ్వర్యంలో పవిత్రమైన శ్రీ కోట నాగేశ్వర స్వామి దేవస్థానం లో భక్తిశ్రద్ధలతో శివ స్వాములకు మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పాటిల్ హనుమంత్ రెడ్డి శివ స్వాముల సేవను పరమ పుణ్యకార్యంగా భావించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని భక్తి భావంతో ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎస్వీ మోహన్ రెడ్డి మరియు కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త  కోట్ల హర్షవర్ధన్ రెడ్డి  ప్రత్యేక పూజల్లో పాల్గొని, అనంతరం శివ స్వాములకు స్వయంగా అన్న ప్రసాదం వడ్డించి ఆశీస్సులు పొందారు.శివ దీక్షలో ఉన్న స్వాములు కఠిన నియమాలు పాటిస్తూ భక్తి మార్గంలో నడుస్తారు. వారికి అన్నదానం చేయడం అనేది అత్యున్నతమైన దానంగా శాస్త్రాలు పేర్కొంటాయి. “అన్నదానం మహాదానం” అనే సనాతన సత్యాన్ని ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం భక్తి, సేవా భావాలకు నిదర్శనంగా నిలిచింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కిషన్ ,పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

About Author