NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రయాణికులకు కల్తీ పాలు విక్రయించొద్దు…

1 min read

 కల్తీ పాలు, ఖనిజాలు లేని నీరు అమ్మితే చర్యలు తప్పవు

  •  ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్​  రావు

కర్నూలు , న్యూస్​ నేడు: ప్రయాణికులకు కల్తీ పాలు, ఖనిజాలు లేని నీరు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్​ రావు. గురువారం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్​ ఆవరణలో ప్రయాణికులకు,  ఆర్టీసీ ఆవరణలోని దుకాణదారులకు కల్తీ పాలు, నీరు పై అవగాహన సదస్సు నిర్వహించారు.  రాష్ట్ర డైరెక్టర్​ ,  ఆహార భద్రత కమిషనర్​ , మంగళగిరి ఆదేశాల మేరకు ఆర్టీసీ డిఎం శ్రీనివాసులు నేతృత్వంలో ఆహార భధ్రత జిల్లా ఉన్నతాధికారి కుర్మా నాయక్​ సమక్షంలో కల్తీ పాలు, మినరల్​ వాటర్​,  పాలు కల్తీవా కదా… తెలుసుకునేందుకు చేయాల్సిన ప్రాథమిక చర్యలు తదితర అంశాలపై అవగాహన సదస్సు జరిగింది.  ఈ సందర్భంగా  ఆహార భద్రత జిల్లా అధికారి రాజ గోపాల్​ రావు మాట్లాడుతూ పాలలలో యూరియా, సోడియం, స్టాచ్​ కలిపితే వచ్చే ఫలితాల గురించి ప్రయోగం ద్వారా క్షుణ్ణంగా వివరించారు.  మినరల్​ వాటర్​ లో 70 శాతం పైగా  ఖనిజాలు ఉండే వాటర్​ బాటిళ్లు విక్రయించాలని, కొన్ని దుకాణాలలో 58 శాతం, మరికొన్ని 62శాతం  మినరల్​ ఉండే  వాటర్​ ను విక్రయిస్తున్నారని, ఇది మంచి పద్దతి కాదన్నారు. మరోసారి వచ్చినప్పుడు అన్ని దుకాణాల్లో విక్రయించే వాటర్​ బాటిళ్లు, పాలను తనిఖీ చేస్తామని, అప్పుడు కల్తీ అయిందని తేలితే చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆహార భద్రత జిల్లా అధికారి రాజగోపాల్​ రావు హెచ్చరించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్​ సంధ్యారాణి, కంజ్యూమర్​ జిల్లా సెక్రటరి శివ మోహన్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author