వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం నూతన డైరీ ఆవిష్కరణ
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: వ్యవసాయ సంయుక్త సంచాలకులు కర్నూలు శ్రీమతి పిఎల్ వరలక్ష్మి చేత వ్యవసాయ శాఖ ఉద్యోగుల సర్వీస్ సంఘం నూతన డైరీ ఆవిష్కరణ కార్యక్రమం వారి ఛాంబర్ నందు కర్నూలు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ఎమ్. సి. కాశన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అయినది.ఈ కార్యక్రమంలోఏడీఏ రాజశేఖర్ మరియు జిల్లా కార్యదర్శి పి మహేందర్ బాబు కోశాధికారి నాగ కిషోర్ మరియు ఉపాధ్యక్షులు యాసనుల, శ్రీదేవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శంకర్ నాయక్, సంయుక్త కార్యదర్శి ఇలియాస్ భాష, కాజా భాష, జిల్లా ఈసీ మెంబర్ దేవరాజు, మరియు పరిపాలన అధికారులు పద్మావతిగారు, శోభ లత మరియు కర్నూలు జిల్లా కార్యవర్గము మరియు ఇతర వ్యవసాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జేడీఎ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఉద్యోగుల సమస్యలపై చర్చించడం జరిగినది.

