ఉపవాసాలు ఆచరించిన ముస్లిం సోదరులకు పళ్ళు, స్వీట్స్ పంపిణీ
1 min read

మత సామరస్యం, పేదలకు సహాయం వంటి మానవత్వ విలువలతో అల్లాహ్ ను అనుసరించడం అభినందనీయం: ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్
గోశాల, న్యూస్ నేడు : పెనమలూరు నియోజకవర్గం గోశాల గ్రామంలో మహమ్మద్ ఆరీఫ్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ బోడే ప్రసాద్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.యందువ రాంబాబు, మాబూ సుభానీ ఆధ్వర్యంలో ఉపవాసాలు ఆచరించిన ముస్లిం సోదరులకు పళ్ళు, స్వీట్స్ పంపిణీ చేశారు.జిల్లా తెదేపా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి సీనియర్ నాయకులు మారుపూడి ధనకోటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు కోయా ఆనంద్, కార్పొరేషన్ డైరెక్టర్లు శొంఠి శివరామ్ ప్రసాద్, పీతా గోపి, నాని, సంగేపూ రంగారావు, షేక్ రవూఫ్, కోనేరు వెంకటేశ్వరరావు, కూటమి నేతలు పాల్గొన్నారు.

